*కుటుంబ సమేతంగా మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు*

0
404

*కుటుంబ సమేతంగా మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు* ///

*నంద్యాల జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 25 –:*

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.ఎస్ రంగాపురం లోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు... దర్శనార్థం ఆలయానికి చేరుకున్న ఎంపీ కి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ఆలయంలో మద్దిలేటి నరసింహ స్వామి, మహాలక్ష్మి అమ్మవార్లకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు...దర్శనం అనంతరం ఎంపీ నాగరాజు తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు..ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు ఆయన తండ్రి భూషణ్ణ, సతీమణి జయ సుధ, కుమారుడు కార్తీక్, కుమార్తె రిషిత పాల్గొన్నారు...