*మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* /// *మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* /// *ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*

0
461

*మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* /// 

 

 *మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* /// 

 

 *ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* /// 

 

*హైదరాబాద్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కొరకు మాగంటి అక్షర,దిశిరలతో కలిసి సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ బస్తీలలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇంట్టింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ... 18 ఏళ్లు నిండిన మహిళకు 2500 ఇస్తామని, అమ్మాయిల స్కూటీలు, పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారేతప్ప , పథకాలను అమలు చేయలేరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లను , కళ్యాణ లక్ష్మిలను , షాదీ ముబారక్ వంటి పథకాలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పి , బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో భూత్ ఇంచార్జిలు , స్థానిక నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.