*మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి*

0
359

*మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 23 –:* పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ నంద్యాల చెక్ పోస్ట్ దివ్య వైన్ షాప్ వద్దకు వెళ్లి అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు వివరించారు . 

 ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి , విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాస రావు , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ , వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి , నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్, తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్ , అర్బన్ యూనిట్ ఇంచార్జి జనార్ధన్ ఆచారి , శేఖరప్ప , సర్కార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.