*రాజ్ పుత్ లకు శ్రీశైలం లో వసతి గృహం ఏర్పాటు చేయాలి*./// *. కర్నూలు నగరంలో మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం నిర్మాణానికి అనుమతి*. /// *మంత్రి టీజీ భరత్ కు విన్నవించిన బి రాఘవేంద్ర సింగ్*. /// *కర్నూలు కార్పోరేషన్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు బి.రాఘవేంద్ర సింగ్ తెలిపారు. కార్తీక వనభోజనం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులు మంత్రి టీజీ భరత్ ను శ్రీశైలంలో వసతి గృహం కల్పించాలని మరియు కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించగలరని విన్నవించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులకు మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. కర్నూలు లో రాజ్ పుత్ బొందిలి సంబంధించి 2వేల కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజ్ పుత్ బొందిలి నీ అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని యువజన సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్, ట్రెజరర్ బి భవానీ సింగ్, సత్యనారాయణ సింగ్,సాయి కిరణ్ సింగ్,సాయి చరణ్ సింగ్, మహేశ్వర సింగ్,నారాయణ సింగ్, అభిమన్య సింగ్, నరహరి సింగ్, మహేశ్ సింగ్, సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
*రాజ్ పుత్ లకు శ్రీశైలం లో వసతి గృహం ఏర్పాటు చేయాలి*./// *. కర్నూలు నగరంలో మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం నిర్మాణానికి అనుమతి*. /// *మంత్రి టీజీ భరత్ కు విన్నవించిన బి రాఘవేంద్ర సింగ్*. /// *కర్నూలు కార్పోరేషన్ రిపోర్టర్ (నేటి గళం) –:* కర్నూల్ రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం మహోత్సవం ఆదివారం కర్నూల్ నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు ఘనంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు బి.రాఘవేంద్ర సింగ్ తెలిపారు. కార్తీక వనభోజనం మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులు మంత్రి టీజీ భరత్ ను శ్రీశైలంలో వసతి గృహం కల్పించాలని మరియు కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించగలరని విన్నవించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని రాజ్ పుత్ బొందిలి యువజన సంఘం నాయకులకు మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. కర్నూలు లో రాజ్ పుత్ బొందిలి సంబంధించి 2వేల కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజ్ పుత్ బొందిలి నీ అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని యువజన సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్, ట్రెజరర్ బి భవానీ సింగ్, సత్యనారాయణ సింగ్,సాయి కిరణ్ సింగ్,సాయి చరణ్ సింగ్, మహేశ్వర సింగ్,నారాయణ సింగ్, అభిమన్య సింగ్, నరహరి సింగ్, మహేశ్ సింగ్, సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 308 Views 0 Reviews
Sponsored